Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ శివాజీ వెనుక చంద్రబాబు... కన్నా

Webdunia
సోమవారం, 29 జులై 2019 (06:25 IST)
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. మీడియాతో మాట్లాడుతూ... గరుడ పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తముందని ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీడీపీ అధినేత శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు.
 
ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని కన్నా వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించి నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం చేసిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.  ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని.. అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కుటుంబం కుప్పకూలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీతో పాటు దేశమంతా బీజేపీవైపు చూస్తోందని.. యువత పెద్ద ఎత్తున తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని కన్నా స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments