Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:15 IST)
Chandra babu
సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక పాలసీ లక్ష్యాలను ఉల్లంఘించకూడదని ఉద్ఘాటించారు. 
 
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇసుక కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన కేబినెట్ మంత్రులపై సీరియస్ అయ్యారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఉచిత ఇసుక విధానంలో మరోసారి ఇలాంటి తేడాలు కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో అన్నీ సర్దుకోవాలని చెప్పారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఉచిత ఇసుక విధానం అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి బాధ్యత వహించాలని ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారు. అనవసరమైన షరతులన్నీ తొలగించాలని, ఇసుక రవాణా, తవ్వకాలకు కనీస చార్జీలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments