Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయం లేదు మిత్రమా.. రోజూ 18 గంటలు పనిచేయండి.. చంద్రబాబు

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (14:53 IST)
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 18 రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మరింత విస్తృత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల మిషన్‌పై ఆయన గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశానికి తిరుగులేని మెజారిటీ వస్తుందని, మహిళలంతా తెలుగుదేశంవైపే ఉన్నారని పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రోజుకు 18 గంటలపాటు పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 రోజులే మిగిలి ఉండటంతో కార్యకర్తలందరూ 18 రోజులపాటు కష్టపడి పనిచేసి ప్రజల్లో అపోహలను తొలగించాలని సూచించారు. 
 
ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పని చేయాలని, ఇది మీకు పరీక్షా సమయం అని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ అధినేతకు తెలుగుదేశానికి వస్తున్న జనాదరణ చూసి మింగుడుపడటం లేదని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments