Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమి కంటే.. ఓడిన తీరే బాధగా ఉంది : చంద్రబాబు

Webdunia
శనివారం, 25 మే 2019 (07:55 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కొందరు పార్టీ సీనియర్ నేతలు కలుసుకున్నారు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో గెలుపొందిన కొందరు నేతలు ఆయనతో సమావేశమై ఎన్నికల ఫలితాలపై విశ్లేషించారు. ప్రధానంగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయం చెందడంపై వారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఈ ఓటమిపై టీడీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ముఖ్యంగా, ఐదేళ్ళపాటు మీరు ఎంత చాకిరీ చేశారో తలచుకుంటే బాధ కలుగుతుంది సార్ అని చంద్రబాబుతో పలువురు నేతలు అన్నారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ. మనం పడిన కష్టం ప్రజలకు తెలుసు.. కానీ తప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకుని అధ్యయనం చేయాల్సివుందన్నారు. 
 
అసలు ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ నమ్మలేక పోతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం.. ఒకవేళ ఓడినా మెజారిటీ మార్కుకు 10 లేదా 15 సీట్లు తక్కువగా వస్తాయని అంచనా వేశాం. కానీ ఇంత ఘోరమైన పరాభవమా? అంటూ ఆయన నేతల వాపోయినట్టు సమాచారం. ఈ ఓటమి కంటే.. ఓడిన తీరు చాలా బాధగా ఉందన్నారు. 
 
మనకు కేవలం పాతిక సీట్లే వచ్చాయా? విపక్షానికి 151 సీట్లా? నమ్మశక్యంగా లేదన్నారు. అంటే మనం నిజంగా అంత ఘోర తప్పిదాలు చేశామా? ప్రజలను కష్టపెట్టామా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments