Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలు, గుండాల మాదిరిగా రైతుల్ని అరెస్ట్ చేస్తారా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (11:16 IST)
రైతుల అరెస్ట్‌ను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో రైతుల అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు పెట్టడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు. 
రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలన్నారు. భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా..? నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయమన్నారు. 
 
దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా..? జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా..? రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా...? అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా..? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా..? ఆరుగురు రైతులపై ఏడు సెక్షన్లు నమోదు చేస్తారా..? అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలిస్తారా..? రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై ఇంత అమానుషమా..? 33వేల ఎకరాలు అందజేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లంటారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
13 రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోరా..? వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికం వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయలేరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments