Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:15 IST)
Chandra babu
సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇసుక పాలసీ లక్ష్యాలను ఉల్లంఘించకూడదని ఉద్ఘాటించారు. 
 
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇసుక కోసం పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఆయన కేబినెట్ మంత్రులపై సీరియస్ అయ్యారు. పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉచితంగా ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, కొందరు దళారులు ఇసుకకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
ఉచిత ఇసుక విధానంలో మరోసారి ఇలాంటి తేడాలు కనిపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో అన్నీ సర్దుకోవాలని చెప్పారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
ఉచిత ఇసుక విధానం అమలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి బాధ్యత వహించాలని ఇన్‌చార్జి మంత్రులను ఆదేశించారు. అనవసరమైన షరతులన్నీ తొలగించాలని, ఇసుక రవాణా, తవ్వకాలకు కనీస చార్జీలు మాత్రమే వర్తింపజేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments