Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం లేదంటే హోటల్‌పై దాడి చేస్తారా : వైకాపాపై చంద్రబాబు ఫైర్

Webdunia
సోమవారం, 16 మే 2022 (14:23 IST)
భోజనం అయిపోయిందని చెబితే హోటల్‌పై దాడి చేస్తారా అంటూ వైకాపా ప్రభుత్వం పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశాంతమైన కుప్పంలో దాడుల సంస్కృతిని తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో వైకాపా కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"కుప్పంలో హోటల్‌పై వైకాపా కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్‌పై వైసీపీ ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం. 
 
ఫర్నిచర్ ధ్వంసం చేసి, మహిళలను బెదిరించడంపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి. హోటల్ నిర్వాహకులను చంపేస్తాం... హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది. అంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 
 
మరోవైపు, కుప్పం పట్టణంలో బైపాస్ రహదారికి సమీపంలో ఉన్న ఓ డాబాపై వైకాపా కౌన్సిలర్లు వీరంగం సృష్టించిన సీసీ ఫుటేజీ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరలైంది. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌, మరో కౌన్సిలర్‌ కుమారుడు, వారి అనుచరులు దాబాపై దాడి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments