ఎపి డిజిపికి వరుస సవాళ్లు...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (20:48 IST)
ఎపి డిజిపి ఆర్.పి.ఠాగూర్ సవాళ్ళతో సావాసం చేస్తున్నారు. ఆయన ఆ సీట్లో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు డిజిపికి కొత్త సవాళ్ళను విసురుతున్నాయి. వరుస ఘటనలతో పోలీస్ బాస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 
అనేక వడపోతల తరువాత నాలుగు నెలల క్రితం ఎపి డిపిజిగా ఆర్.పి.ఠాగూర్ ను ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి డిజిపికి కంటి మీద కునుకులేదు. బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి ప్రభుత్వంతో పాటు డిజిపికి తలనొప్పిగా మారింది. జరుగుతున్న వరుస ఘటనలకు వెంటనే స్పందిస్తున్నా ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి పడుతూనే ఉంది. 
 
అనంతలో ప్రబోధానంద ఆశ్రమం.. పోలీసులు, ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలాగే విశాఖలో టిడిపి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇదంతా డిజిపిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.
 
ఇదిలా ఉండగానే ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై దాడి. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నట్లు డిజిపి పరిస్థితి మారింది. ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ పైన దాడి జరిగిన తరువాత డిజిపి మాట్లాడిన తీరును వైసిపి నేతలు తప్పుబట్టారు. జగన్ పైన దాడి చేసిన తరువాత పోలీసులు వేగంగా స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నాలుగు నెలల కాలంలో డిజిపి అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

Akhanda 2: అఖండ 2 క్రిస్ మస్ కు తాండవం చేస్తుందా ? దామోదర ప్రసాద్ ఏమన్నారంటే..

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments