వైకాపా నేతల వేధింపులు - పంచాయతీ మహిళా కార్యదర్శి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (08:53 IST)
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ (32) ఆత్మహత్య చేసుకుంది. అధికార పార్టీ నేతల ఒత్తిడి, వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది. గత 2019లో ఆమె పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె బాధ్యతలు చేపట్టిన మూడు నెలల తర్వాత పంచాయతీ పాలకవర్గం సమావేశం నిర్వహించాల్సివుంది. కానీ, 90 రోజులు అయినప్పటికీ సమావేశం నిర్వహించలేదు. 
 
ఇదే అంశంపై ఆమెపై కొందరు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఆమె తీవ్ర మనస్తాపానికిగురైంది. పైగా, తనపై ఫిర్యాదు చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ఫిర్యాదుదారులు రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ డబ్బును కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెపై వేధింపులు అగలేదు. దీంతో మనస్తానికి లోనైన భవానీ ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే మృతదేహాన్ని తరలించాలని పట్టుబట్టారు. వారికి పోలీసులు నచ్చజెప్పడంతో శాంతించారు. భవానీ భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments