Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య..

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:44 IST)
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం శిరిష్మ హైదరాబాద్‌లో ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఓయూ కాలనీలోని ట్రయల్‌ విల్లాస్‌లో నివసించే గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలోని ప్లాట్‌ 906-డిలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. 
 
వివాహమై నాలుగేళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో శిరిష్మ కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో బుధవారం రాత్రి తన ఇంట్లోని ఓ గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
శిరిష్మ భర్త సిద్దార్థ్ బుధవారం రాత్రి ఇంటికి చేరుకునేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు అతను సమాచారమిచ్చాడు. ఆపై ఆస్పత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments