Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరును టూరిజం హ‌బ్ గా మార్చాల‌న్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (11:20 IST)
న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అయ్యారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి ప్రతిపాదనలను సమర్పించారు.  
 
 
సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం స‌మ‌ర్పించారు. 

 
ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి మంత్రి మేకపాటి తెలిపారు. నెల్లూరు జిల్లాకు చారిత్రాత్మ‌క ప్రాధాన్యం ఉంద‌ని, ఇక్క‌డ సంప్ర‌దాయబ‌ద్ధంగా జ‌రిగే స్థానిక పండుగల‌కు అశేషంగా పర్యాట‌కులు వ‌స్తుంటార‌ని అన్నారు. స్థానిక రొట్టెల పండ‌గకు, ఇత‌ర ఉత్స‌వాల‌కు అసంఖ్యాకంగా భ‌క్తులు వ‌స్తార‌ని వివ‌రించారు. నెల్లూరును టూరిజం ప‌రంగా హ‌బ్ గా మార్చాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌న ఆకాంక్ష‌ను తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments