Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్, చైనాల‌ కవ్వింపు చర్యల‌ను తిప్పికొట్టాలి

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (09:46 IST)
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు. పాకిస్థాన్, చైనాల‌ చర్యలను తిప్పికొట్టాల‌న్నారు.

తిరుపతిలో కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరించుకుంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సతీమణులను కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి సన్మానించారు. మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేద‌ని, దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నార‌ని చెప్పారు. దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాల‌ని, దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయార‌ని, అలాంటి సైనికుల కుటుంబాలకు అండగా ఉండాల‌ని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

వీర సతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని, సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామ‌న్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments