Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకేసిన పోలవరంను సందర్శించనున్న నిపుణుల కమిటీ

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (13:07 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. అయితే, ఆదివారం కేంద్ర నిపుణుల కమిటీ ఈ ప్రాజెక్టును సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టు పురోగతిని స్వయంగా పరిశీలించనుంది. 
 
గడిచిన కొద్ది మాసాలుగా గోదావరి వరదలు కారణంగా పనులు మందగించడం, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడిన అనంతరం తాజా పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలించబోతుంది. ఇప్పటికే పలుమార్లు పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పటికీ తాజా రాక ఆసక్తిగా మారింది. పరిస్థితిని భేరీజు వేయడంతోపాటు ఇంతకుముందు తాము సూచించిన విధంగా పనులు కొనసాగుతున్నదీ లేనిదీ కమిటీ పర్యవేక్షించనుంది. 
 
నిపుణుల కమిటీ చైర్మన్‌ ఎస్‌కే హల్దార్‌, ఆర్‌కే పచౌరి, ఎస్‌ఎల్‌ గుప్తా, డి.రంగారెడ్డి, బీపీ పాండేతో సహా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ సాంకేతిక నిపుణులు డీపీ భార్గవ పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారిలో ఉన్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పనులను, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను కూడా కమిటీ పరిశీలించనుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments