వివేకా హత్య కేసు విచారణ : సీబీఐ అధికారులకు వార్నింగ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (09:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బెదిరించారు. ఈ కేసు విచారణను తక్షణం నిలిపివేసి కడపను వీడి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులపై సీబీఐ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా, సీబీఐ అధికారులకు కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వలీబాషాను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీనిపై ఆయన కడప చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ బెదిరింపులపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 8వ తేదీన సీబీఐ అధికారులకు భోజనం తెచ్చేందుకు వలీబాషా కారులో కడపలోని హరిత హోటల్‌ నుంచి బైపాస్ రోడ్డులోని డాబాకు వెళ్లారు. భోజనం పట్టుకుని తిరిగి వస్తుండగా, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారుకు బైకును అడ్డుగా పెట్టి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. 
 
సీబీఐ అధికారులతో పాటు నువ్వు కూడా దర్యాప్తును ఆపేసి కడపను వదిలి తక్షణం వెళ్లిపోవాలి. లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దండుగులు తనను బెదిరించిన విషయమై ఈ నెల 9వ తేదీన వలీబాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments