Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందులలో సీబీఐ బృందం.. వివేకా - అవినాష్ ఇళ్ళలో తనిఖీలు

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (18:57 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు మరోమారు పులివెందులలో కనిపించారు. ఆదివారం కొందరు అధికారులు పులివెందులకు చేరుకుని వివేకా నంద రెడ్డి హత్యకు గురైన ఇంటితో పాటు ఆ పక్కనే ఉన్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. 
 
అలాగే, వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే ఇనయతుల్లాతో కూడా సిట్ అధికారులు మాట్లాడారు. వివేకా హత్య జరిగిన ఇంటితో పాటు బాత్రూమ్, బెడ్రూమ్‌లను కూడా పరిశీలించారు. అటు తర్వాత వివేకా ఇంటి నుంచి బయటకు వచ్చిన అధికారులు సమీపంలోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆ పరిసరాలను తనిఖీ చేశారు. అవినాష్ ఇంటిని పరిశీలించాక తిరిగి వివేకా ఇంటికి వచ్చిన హత్య జరిగిన ప్రాంతాన్ని చూశారు. 
 
హత్య జరిగిన రోజున, సమయంలో ఎవరెవరు ఉన్నారో ఆరా తీశారు. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చునే సాంకేతికంగా ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా, తమ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలను నిజమో కాదో.. ఆయన పీఏ రమణారెడ్డి వద్ద కూడా ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments