Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనతో ప్రయాణం ముగిసింది... ఇక రైతులతోనే... వీవీ లక్ష్మీనారాయణ (video)

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (09:59 IST)
జనసేనతో తాను సాగిస్తూ వచ్చిన ప్రయాణం ముగిసిందని, అంటే... ఇక అది ముగిసిన అధ్యాయం అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను ఆ పార్టీ ఆమోదించినందున దాని గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి తన ప్రయాణమంతా రైతుల కోసం సాగుతుందన్నారు.
 
రైతుల సంక్షేమం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరతానన్న విషయం త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మాత్రమే మార్గమని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా హితంగా ఉందని, పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయన్నారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. 
 
అనుబంధ బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments