సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతివ్వొద్దు : కోర్టులో సీబీఐ కౌంటర్

ఠాగూర్
గురువారం, 9 మే 2024 (16:17 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే, జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ వ్యవధిలో యూరప్ పర్యటనకు వెళ్లాని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దీంతో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ ఆయన బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. దీంతో గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. జగన్ ఇప్పటికే ఓసారి విదేశాలకు వెళ్లివచ్చారని, అందువల్ల ఈ దఫా పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. దీంతో తుదపరి విచారణనను ఈ నల 14వ తేదీకి వాయిదా వేసింది.
 
అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆయన ఓసారి విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన సీబీఐ కోర్టు ఈ నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments