Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ గ్యాంగ్ కబ్జా వివాదం : ఎంపీ టీజీ వెంకటేష్‌పై కేసు -

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:30 IST)
కర్నూలు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత టీజీ వెంకటేష్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో రూ.100 కోట్ల విలువ చేసే వివాదాస్పద భూమి వ్యవహారంలో ఆయనపై హైదరాబాద్ నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడు విశ్వప్రసాద్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు రోడ్డు నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్‌ పార్క్ కోసం గత 2005లో అప్పటి  ప్రభుత్వం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో ఇప్పటికే భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే, ఈ స్థలాన్ని ఆనుకుని మరో అరెకరం స్థలాన్ని టీజీ వెంకేటేష్ సోదరుడు కుమారుడు సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో పాటు మరికొందరు ఇటీవల డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో ఈ స్థలం స్వాధీనం చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోనీ నుంచి దాదాపు 90 మంది హైదరాబాద్ నగరానికి చేరుకుని సెక్యూరిటీ గార్డు పట్ల దురుసుగా ప్రవర్తించారు. 
 
దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని 63 మందిని అరెస్టు చేశారు. మిగిలినవారంతా పారిపోయారు. వారంతా తమ వెంట తెచ్చిన మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో టీజీ వెంకటేష్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ సహా మొత్తం 15 మంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments