Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత - అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (15:23 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్వాల మండలం వేములలో ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఇక్కడ ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత పాదయాత్ర ముందుకుసాగింది. అయితే, కొందరు స్థానిక తెరాస కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకున్నారు. 
 
దీంతో బీజేపీ కార్యకర్తలు వారితో తలపడటంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ వెంటనే పోలీసులు తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సీఎం, తెరాస అధినేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బీజేపీ కార్యకర్తలను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ నచ్చజెప్పి శాంతింపజేశారు. 
 
అంతకుముందు బండి సంజయ్ మాట్లాడుతూ, నీళ్లు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆరోపించారు. అలాగే, గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోనూ మాట తప్పారన్నారు. ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments