Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్చికి కరోనా దెబ్బ

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (09:04 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. మిర్చినీ దెబ్బ కొట్టింది. మిర్చి రైతులనూ దడ పుట్టిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారస్తులు రైతును నిండా ముంచుతున్నారు.

రాత్రికి రాత్రి ధరను సగానికి తగ్గించారు. క్వింటా మిర్చి ధర రూ.22 వేల నుంచి ఒక్కసారిగా రూ.11వేలకు తగ్గించారు. అయితే వ్యాపారులు మాత్రం దేశీయంగా పంట భారీగా మార్కెట్లకు వస్తుండటం, ఇదే సమయంలో ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గాయని చెబుతున్నారు.

పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతును కరోనా వైరస్‌ పేరు చెప్పి...తక్కువకు భేరాలాడుతున్నారు. ఈ-నామ్‌ను సైతం సక్రమంగా అమలు చేయకపోవడం రైతులు నిండా మునుగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నోరు మొదపకపోవడం విశేషం.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు రైతులను నిండా ముంచుతున్నారు. మిర్చి ధరలను ఒకసారి పరిశీలిస్తే 2017నాటి వ్యాపారుల మాయాజాలం గుర్తుకొస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2017 మార్చి 31న వరంగల్‌ జిల్లా ఎనుమాముల, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో లక్షల సంఖ్యలో అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలను చూసి వ్యాపారులు, దళారులు ఏకమై క్వింటా మిర్చికి రూ.5వేలు తగ్గించిన విషయం విదితమే.

దాంతో ఆగ్రహించిన రైతులు రెండు జిల్లాల్లోని మార్కెట్లలోనూ మిర్చికి నిప్పుపెట్టి తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఖమ్మం మార్కెట్‌లో ఆందోళనకు దిగారంటూ పదిమంది అన్నదాతలపై కేసులు మోపి వారి చేతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించడంతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం మిర్చి రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొదట్లో భారీగా ధర ఉండటంతో...అప్పుల నుంచి గట్టెక్కి.. ఎంతో కొంత చేతిలో మిగులుతుందని ఆశించిన రైతుకు తిరిగి చేదు అనుభవమే ఎదురవుతోంది. పంట చేతికొచ్చి మార్కెట్‌ తీసుకెళ్లాక ధరలు అమాంతం తగ్గింస్తుండటంతో రైతులు నేల చూపులు చూడాల్సివస్తోంది.
 
ఖరీఫ్‌లో పంటను 2019 డిసెంబర్‌లో 20,993 క్వింటాళ్లు, 2020 జనవరిలో 79,294 క్వింటాళ్ల తేజ మొదటి రకం మిర్చిని రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు.

అదే సమయంలో డిసెంబర్‌లో 13,977 క్వింటాళ్లు, జనవరిలో 16,583 క్వింటాళ్ల తాలు రకం మిర్చిని కూడా అమ్మకానికి తీసుకొచ్చారు.

జనవరి ప్రారంభంలో అరకొరగా రైతులు పంట తెచ్చినప్పుడు క్వింటా రూ.21వేల నుంచి రూ.22వేల వరకూ ధర పలికింది. క్రమేపీ మార్కెట్‌కు మిర్చి రాక పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను రూ.22వేల నుంచి రూ.11వేలకు తగ్గించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments