Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కారు కొని ఇంటికి తీసుకెళ్తుండగా జనంపైకి దూసుకెళ్లింది..

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (19:34 IST)
ఓ వ్యక్తి ఇష్టపడి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆ కారును షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళుతున్నాడు. అయితే, ఆయన్ను దురదృష్టం వెంటాడింది. కారు టైరు పేలి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం కాగా ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ అనే వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేశాడు. కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి వెళ్తున్న క్రమంలో స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద కారు టైరు పేలిపోయింది. 
 
దాంతో కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి వెళుతున్న పాదాచారాలు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. పార్కింగ్‌ చేసిన బైకులపై దూసుకెళ్లడంతో 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి.
 
ఘటన అనంతరం కారు యజమాని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments