Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బోర్డర్‌ను తలపిస్తున్న తుళ్ళూరు - భారీగా పోలీసు బలగాలు

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (10:43 IST)
అమరావతి ప్రాంతమైన తుళ్లూరు ప్రాంతం పాకిస్థాన్ సరిహద్దులను తలపిస్తోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని పోలీసు బలగాలతో అణిచివేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు. "రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయి. పాకిస్థాన్ బోర్డర్‌లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరు. అన్యాయంగా, క్రూరంగా పోలీసు బలంతో ఉద్యమాన్ని అణిచివెయ్యాలని జగన్‌ యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు. 
 
వైకాపా ప్రభుత్వం ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుంది. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైకాపా ప్రభుత్వం మానుకోవాలి" అని ట్వీట్ చేశారు. అలాగే, రైతులు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతునిచ్చిందని ఆయన గుర్తుచేశారు.

 

సంబంధిత వార్తలు

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments