అమరావతిదే అంతిమ విజయం : చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:31 IST)
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని, అంతిమ విజయం అమరావతిదేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు. 
 
అదేసమయంలో అనంతపురం జిల్లాలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమపై గతంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో చంద్రబాబు ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కియాను తరిమేస్తానంటూ ప్రతిపక్ష నేతగా జగన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. కియాపై నాడు జగన్‌ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా లోకేశ్‌ సెల్ఫీ ఛాలెంజ్‌లను ప్రస్తావిస్తూ వీడియోలను చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కెన్‌యూ ఆన్సర్‌ మిస్టర్‌ జగన్‌? అంటూ మాజీ సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments