Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలు చేయకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలవగలదా? సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (22:41 IST)
వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు. అధికార దర్పంతో జగన్ విర్రవీగుతున్నాడంటూ ధ్వజమెత్తారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని తిరుపతిలో బిజెపి నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సోము వీర్రాజు హాజరయ్యారు. 
 
వైసిపి బెదిరింపులకు భయపడేది లేదని.. వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొడతామన్నారు. రానున్న ప్రధాన ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసిపి ఏ ఎన్నికల్లోనైనా గెలిచిందా అంటూ ప్రశ్నించారు. 
 
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి గెలుపు ఒక గెలుపేనా అంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా బిజెపి అభ్యర్థులు పోటీ చేశారని.. ప్రభుత్వ అధికారులు వైసిపి కోసం పనిచేస్తున్నారన్నారు. మోడీ ఆలోచనా విధానమే ఆయుధంగా తిరుపతి ఉప ఎన్నికల్లోకి వెళతామన్న సోము వీర్రాజు.. జనసేనతో కలిసే ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments