Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉండవల్లి కాల్ మనీ కింగ్ ... చంపేస్తాన‌ని బెదిరింపులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (11:02 IST)
సాక్షాత్తు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొలువైన తాడేప‌ల్లి ప్రాంతంలో కాల్ మ‌నీ వ్యాపారం కోర‌లు చాస్తోంది. ఈ ప్రాంతంలో కాల్ మ‌నీ కింగ్ గా పేరొందిన ఒక వ్య‌క్తిపై తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. 
 
 
ఉండవల్లి చెందిన మణికంఠ అనే కాల్ మనీ వ్యాపారి మ‌ణికంఠ‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భారీ వ‌డ్డీకి న‌గ‌దు అప్పుగా ఇచ్చి, ఇప్ప‌టికిప్పుడు నగదు చెల్లించకపోతే రౌడీషీటర్ల చేత చంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు మణికంఠపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇల్లు అమ్మి డబ్బులు చెల్లిస్తానని ప్రాధేయపడ్డా కాల్ మనీ కింగ్ కనికరించడం లేద‌ని  పేర్కొంటున్నారు.
 
బాధితుడి ఇల్లు ఆక్రమించిన మణికంఠ, ఖాళీ చేయమంటే దిక్కున చోట చెప్పుకోవాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఫిర్యాదు చేశారు. బాధితులు ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించారు. మణికంఠపై అనేక అక్రమ వ్యాపారాల ఆరోపణలున్నాయి. గత కొంతకాలంగా కాల్ మని, అక్రమ వడ్డీ వ్యాపారాలకు ఉండ‌వ‌ల్లి కేంద్రంగా మారింది. దీనిపై పోలీసులు దృష్టి పెట్టాల‌ని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments