Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్ డోజ‌ర్ ప‌నులు ఎక్కువ వ‌చ్చాయ‌నే ఈర్ష్య‌తో...

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (15:38 IST)
త‌న‌కు రాని కాంట్రాక్ట్ ప‌నులు, తోటి స్నేహితుడికి ఎక్కువ వ‌చ్చాయ‌నే ఈర్ష్య‌తో క‌క్ష‌గ‌ట్టి చంపేసిన ఓ నిందితుడి ఉదంత‌మిది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో స్నేహితుడిని మట్టుబెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు, అత‌డు ఈర్ష్య‌తో స్నేహితుడిని పథకం ప్రకారమే హత్య చేసినట్లు వెల్లడించారు. 

 
మీడియాకు డిఎస్పి కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల మేరకు, గిద్దలూరు మండలం దేవ నగర్ గ్రామానికి చెందిన చాగలమరి సిద్దయ్య గత 20 సంవత్సరాలుగా డోజర్ సహాయంతో పొలం చదును చేసే పనుల్లో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. అదే వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్న చింతకుంట్ల శ్రీకాంత్ కు పనులు తక్కువగా రావడం వల్ల సిద్దయ్యపై కోపం పెంచుకున్నాడు. సిద్ధ‌య్య‌ను అడ్డు తొలగించుకుంటే తనకే గ్రామంలో పనులు ఎక్కువగా వస్తాయి అని చంపేందుకు పన్నాగం పన్నాడని తెలిపారు.

 
ఈ నెల 17 గురువారం రాత్రి 8 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు గుట్టపాటి బాల హుస్సేనయ్య, పటాన్ ఖాదర్ భాషాలతో కలిసి శ్రీకాంత్, సిద్దయ్య సంజీవ రాయుని పేట, గడికోట ఫారెస్ట్ చెక్ పోస్ట్ మార్గం ఉన్న కల్వర్టుపై మద్యం సేవించారు. అనంతరం ఉద్దేశపూర్వకంగా శ్రీకాంత్ సిద్దయ్యతో గొడవ పెట్టుకొని, అత‌ని శరీరంలోని సున్నితమైన భాగంలో బలంగా కొట్టడం వల్ల సిద్దయ్య చనిపోయాడని తెలిపారు. ఈర్ష్య‌తో స్నేహితుడిని అంతం చేసిన శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments