Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగ‌ళ‌గిరిలో కార్ వాష్ లో ఇద్ద‌రు యువ‌కుల‌పై మూకుమ్మ‌డి దాడి

మంగ‌ళ‌గిరిలో కార్ వాష్ లో  ఇద్ద‌రు యువ‌కుల‌పై మూకుమ్మ‌డి దాడి
విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (10:34 IST)
ఏపీ సీఎం, మాజీ సీఎం స‌హా, ప‌లువురు ప్ర‌ముఖులుండే మంగ‌ళ‌గిరి ప్రాంతంలోనే దొమ్మిలు జ‌రుగుతున్నాయి. అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుచరుల పేరుతో మంగళగిరి పట్టణంలో కొందరు యువకులు హాల్ చల్ చేశారు. వీరంగం సృష్టించారు. 
 
మంగ‌ళ‌గిరి పట్టణంలోని ఆటోనగర్ లోని టీ స్టాల్, కార్ వాషింగ్ పాయింట్ వద్ద కొందరు యువకులు ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాదాపు 20 మంది యువకులు ఆ ఇద్ద‌రిపై దాడి చేయ‌డంతో అక్క‌డి చుట్టుప‌క్క‌ల వారు హ‌డిలిపోయారు. ఆ ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తీరా ఇది రాజకీయ ప్ర‌మేయంతో జ‌ర‌గ‌డంతో, గాయపడిన వారిని రాజీ చేసేందుకు మంగ‌ళ‌గిరి పట్టణ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. 
 
 
కేసు నమోదు చేస్తున్నట్లు మంగ‌ళ‌గిరి పట్టణ పోలీసులు చెపుతుండ‌గా, పోలీసుల అదుపులోనే ఓ వ్య‌క్తి ఘర్షణకు పాల్పడ్డాడు. ఇలాంటి దొమ్మిల‌పై పోలీసులు దృష్టి పెట్టాల‌ని, పూర్తి స్థాయిలో ఇలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో మరిన్ని ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని  స్థానికులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరవీరుడు సాయితేజ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా