Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీ మాంసం - చికెన్‌ను విక్రయించేందుకే మటన్ మార్టులా: బుద్ధా వెంకన్నా

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మటన్, చికెన్ విక్రయాల కోసం మటన్ మార్టులు పెట్టబోతుందని అధికార వైకాపాకు చెందిన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన ఓ వార్త ఇపుడు హల్చల్ చేస్తోంది. ఈ వార్తపై పెను చర్చకే దారితీసింది. 
 
ఈ మటన్ మార్టుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముకుని బతికే బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టేందుకే ఈ మార్టులను ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శించారు.
 
పీజీలు, డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. వారికి మటన్ కొట్లలో ఉద్యోగాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారని విమర్శించారు. 
 
ఇపుడు కొత్తగా పెట్టబోయే మటన్ మార్టుల్లో కల్తీ మాంసం, చేపలను అమ్మేందుకే ఈ ఎత్తుగడ అంటూ ఆరోపించారు. తన అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి సలహాతోనే ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి ఖజానా నింపుకొనేందుకే ఈ నిర్ణయమని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments