Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు అసత్యాలను నమ్మే స్థితిలో లేరు : అచ్చెన్న

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:02 IST)
పదేపదే అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని టీడీపీ శాసనసభ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష సభ్యులను హేళన చేస్తూ మాట్లాడటం మంచి పద్దతా? అని ప్రశ్నించారు. శాసనసభలోని మీడియా పాయింట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
రుణమాఫీ కింద మూడు విడతలుగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రుణమాఫీ చేయలేదని అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. తమ హయాంలో ప్రజలకు ఏం చేశామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
మరో ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాలు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని జగన్‌ సవాల్‌ చేశారని, ఇవాళ రూ.630 కోట్లు చెల్లించారని ఆయనే చెబుతున్నారని అన్నారు. మాట వరసకు మాత్రమే చెప్పానని జగన్‌ చెప్పడం మంచి పద్ధతా అని ప్రశ్నించారు.
 
'రాజీనామా చేయాల్సింది ఎవరో తెలిసిపోయింది. అవినీతిలో కూరుకున్న వ్యక్తులు అసత్యాలే చెబుతారు. మడమ తిప్పని నాయకుడే అయితే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం.. అంతిమ నిర్ణేతలు ప్రజలే' అని బుచ్చయ్య చౌదరి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments