ఏపీలో బ్లీచింగ్ పౌడర్ భలే పనిచేస్తోంది : బుద్ధా వెంకన్న సెటైర్లు

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:41 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, ఏపీలో బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేస్తుందంటూ సెటైర్లు వేశారు. 
 
కరోనా వైరస్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తోందని, ప్రతి రాష్ట్రం ఏపీని అసుసరిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. పైగా, ఏపీ చర్యలను కేంద్రం కూడా ప్రశంసించిందనీ, ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై బుద్ధా వెంకన్న చురకలంటించారు. "పారాసిటిమాల్‌తో కరోనాని ఎదుర్కొన్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. బ్లీచింగ్ పౌడరుతో వైరస్‌ని చంపినందుకు ఇతర దేశాల అధినేతలు ఆశ్చర్యపోతున్నారు. స్కాట్లాండ్ యార్డు పోలీసులు, ఇంటర్ పోల్ కూడా వస్తోందట" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
'కరోనాతో ప్రపంచమంతా భయపడి చస్తుంటే... ఇంటింటికీ కరోనా - వైఎస్‌ జగన్‌ నజరానా స్కీమ్ ద్వారా ఎలా వ్యాప్తి చేశారో దర్యాప్తు చేస్తారట' అని ఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరుగా వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు జిల్లాలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా మారాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments