Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ సింగ్ న‌గ‌ర్లో దారుణం, బాలిక‌పై అత్యాచారం

Webdunia
గురువారం, 22 జులై 2021 (23:15 IST)
కృష్ణా జిల్లా విజయవాడలో మరో దారుణం చోటు చేసుకుంది. ప‌దిహేనేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటను అజిత్ సింగ్ నగర్లో వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్  నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉండే బాలిక ఓ దుకాణంలో పని చేస్తూ రోజూ ఆటోలో వెళ్లి వస్తుండేది.

ఈ క్రమంలోనే ఆమెకు ప్రకాష్ నగర్ కు చెందిన ఆటోడ్రైవర్ వల్లెపు వసంతకుమార్(19)తో పరిచయం ఏర్పడింది. దుకాణం ప‌ని అయిపోయాక‌, రాత్రి 11 గంటల సమయంలో తన ఆటోలో కొద్ది మంది ప్రయాణికులతో పాటుగా బాలికను ఎక్కించుకున్నాడు వ‌సంత కుమార్. ఇత‌ర ప్రయాణికులను మాత్రం రాజీవ్ నగర్లో దింపేశాడు.

అనంతరం బాలికను ఎక్సెల్ ప్లాంటు సమీపం వాంబే కాలనీలోని న్యూ ఎన్ఎన్ఎయూఆర్ఎం అపార్టుమెంట్ల వద్దకు తీసుకెళ్లాడు. అక్క‌డ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను ఇంటి పరిసర ప్రాంతంలో దింపేసి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలికను తల్లి నిలదీయగా, జరిగిన విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్యాచారం, పోక్సా యాక్టు ప్రకారం డ్రైవర్ పై కేసు నమోదైంది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సీఐ లక్ష్మీనారాయణ చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments