Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభను ఏపీలో నిర్వహించనున్నారు. ఈ సభను ఎక్కడ, ఎపుడు ఏర్పాటు చేయాలన్న అంశంపై సమాచాలోచనలు సాగుతున్నాయి. 
 
ఇటీవల తెరాసను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. దీంతో ఈ పార్టీ తొలి శాఖను ఏర్పాటుచేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు కొందరు బీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో సీనియర్ నేత తోట చంద్రశేఖర్ రావు, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజీ ప్రకాష్‌తో పాటు మరికొందరు ఇటీవలే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించే నిమిత్తం సీఎం కేసీఆర్‌తో చంద్రశేఖర్, పార్థసారథిలు బుధవారం హైదరాబాద్ నగరంలో సమావేశమై చర్చించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ, ఎపుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఏపీలో ప్రారంభించాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments