Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభను ఏపీలో నిర్వహించనున్నారు. ఈ సభను ఎక్కడ, ఎపుడు ఏర్పాటు చేయాలన్న అంశంపై సమాచాలోచనలు సాగుతున్నాయి. 
 
ఇటీవల తెరాసను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారింది. దీంతో ఈ పార్టీ తొలి శాఖను ఏర్పాటుచేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు కొందరు బీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో సీనియర్ నేత తోట చంద్రశేఖర్ రావు, ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టీజీ ప్రకాష్‌తో పాటు మరికొందరు ఇటీవలే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించే నిమిత్తం సీఎం కేసీఆర్‌తో చంద్రశేఖర్, పార్థసారథిలు బుధవారం హైదరాబాద్ నగరంలో సమావేశమై చర్చించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఎక్కడ, ఎపుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఏపీలో ప్రారంభించాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments