Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ ఉంది : బ్రదర్ అనిల్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (16:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ వస్తుందని ఏపీ సీఎం జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ అన్నారు. ఆయన ఉత్తరాంధ్రలో సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
ఇందులో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. ఎన్నికలకు ముందు వైకాపా విజయం కోసం కృషి చేస్న సంఘాలు ఇపుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని బ్రదర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు గోడు వినేందుకే తాను ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. 
 
తనను పార్టీ పార్టీ పెట్టాలంటూ చాలా మంది కోరుతున్నారని కానీ పార్టీ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. దీనిపై సుధీర్ఘంగా ఆలోచన చేసి ఓ అభిప్రాయానికి వస్తానని చెప్పారు. పైగా, తన పరిశీలనలో ప్రధానంగా బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తుందని బ్రదర్ అనిల్ అన్నారు. దీన్ని ఖచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా, బ్రదర్ అనిల్ ఇటీవల కూడా విజయవాడలో ఇదే తరహాలో సమావేశమైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments