Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు అలసిపోయింది.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలింది..

Webdunia
గురువారం, 12 మే 2022 (13:29 IST)
పెళ్లికి అంతా సిద్ధమైంది. తాళికట్టడమే తరువాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లి వేదికపైనే కుప్పకూలింది. అంతేకాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటన విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ, మధురావాడ, పాలెంలో బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి.  కానీ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. 
 
పెళ్లికూతురు బాగా అలసిపోవడంతోనే నీరసంగా కనిపించిందని.. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments