Webdunia - Bharat's app for daily news and videos

Install App

సక్రమంగా స్కూలుకు పంపితేనే అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (15:26 IST)
తమ పిల్లలను సక్రమంగా స్కూలుకు పంపితేనే అమ్మ ఒడి పథకాన్ని అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ  నెల 27వ తేదీన అమ్మ ఒడి పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అయితే, ఈ పథకం కింద ఇచ్చే నిధుల్లో రూ.2 వేల మేరకు తగ్గించారు. అంటే యేడాదికి రూ.15 వేలు ఇవ్వాల్సివుండగా రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పైగా, లబ్దిపొందే విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గించేశారు. 
 
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తవమన్నారు. పాఠశాల హాజరు ఆధారంగానే ఎంపిక జరిగిందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితే పథకం వర్తిస్తుందన్నారు. 
 
విజయనగరంలో ప్రతి ఇంటికీ కొళాయి కలెక్షన్‌ మంజూరు చేయాలనే లక్ష్యంతో నగర పాలక సంస్థ, ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారని బొత్స చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. 
 
ఇంటర్‌లో ఫలితాలు ఏమాత్రం తగ్గలేదని.. 2019 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. పాఠశాల, కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మఒడి పథకాన్ని అర్హులందరికీ ఇస్తున్నామని.. ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ముందుగానే చెప్పామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments