Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ అరెస్టు : రేవంత్ సర్కారు తొందరపడింది : బొత్స

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:12 IST)
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేసి అరెస్టు చేయడంతో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మండిపడ్డారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తొందరపడిందని వ్యాఖ్యానించారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతికి ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేసి అరెస్టు చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తొందరపాటు చర్యకు పాల్పడిందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఆ ఘటనకు ఎవర్ని బాధ్యులుగా చేశారని బొత్స ప్రశ్నించారు. సున్నితమైన అంశాల్లో చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించి అడుగేయాలని హితవు పలికారు. 
 
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరమని, కానీ అధికారంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, పోలీసు ఉన్నతాధికారులు కూడా అన్ని కోణాల్లో ఆలోచన చేసి తగిన విధంగా నడుచుకోవాలని భావిస్తున్నట్టు బొత్స తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments