Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స సత్యనారాయణ పెయిడ్ ఆర్టిస్ట్.. అన్నదెవరు?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (20:45 IST)
మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటున్న బొత్స సత్యనారాయణే పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. రైతులను కించపరిచే విధంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
 
అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకున్న సంధర్భంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు సిపిఐ నారాయణ. రైతులు విమానాలు ఎక్కి తమ సమస్యను చెప్పుకునేందుకు వెళ్ళకూడదా అంటూ ప్రశ్నించారు. న్యాయవ్యవస్ధలపై వ్యాఖ్యలు చేయడం మొత్తం కూడా న్యాయవ్యవస్ధపై దాడిగా భావిస్తున్నామన్నారు. 
 
న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు నారాయణ. రాజధానిగా అమరావతిగా ఉండాలని రైతులను ఆందోళన చేయొచ్చు.. మూడు రాజధానులు అవసరమని అధికార పార్టీ నేతలు చెప్పుకోవచ్చు.. అంతేగానీ ఉద్యమాలను అణచివేసే విధంగా హేళనగా మాట్లాడడం మాత్రం మానుకోవాలంటూ వైసిపి నేతలను హెచ్చరించారు సిపిఐ నేత నారాయణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments