Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ: తెదేపా

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
రాజధానుల ప్రతిపాదనపై వైకాపా ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎఫ్​బీఐ కేసులున్న కంపెనీకి సీబీఐ కేసులున్న వైకాపా నేతలు రాజధాని బాధ్యతుల అప్పగించారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ మిత్రుడు కావటం వలనే రాజధానుల బాధ్యత ఆ కంపెనీకి ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానుల గురించి వేసిన బోస్టన్ కమిటీపై ఎఫ్​బీఐ కేసులు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ కేసులు ఉన్న కంపెనీకి సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... బాధ్యత ఇచ్చారని విమర్శించారు. ఫొక్స్‌వ్యాగన్‌, సారా కేసుల ఆరోపణలు ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ... బోస్టన్ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటారా అని అనురాధ నిలదీశారు.

రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మండిపడ్డారు. రాజధాని విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని వైకాపా నేతలు కొత్త కథలు చెబుతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments