బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ: తెదేపా

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
రాజధానుల ప్రతిపాదనపై వైకాపా ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎఫ్​బీఐ కేసులున్న కంపెనీకి సీబీఐ కేసులున్న వైకాపా నేతలు రాజధాని బాధ్యతుల అప్పగించారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ మిత్రుడు కావటం వలనే రాజధానుల బాధ్యత ఆ కంపెనీకి ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానుల గురించి వేసిన బోస్టన్ కమిటీపై ఎఫ్​బీఐ కేసులు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ కేసులు ఉన్న కంపెనీకి సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... బాధ్యత ఇచ్చారని విమర్శించారు. ఫొక్స్‌వ్యాగన్‌, సారా కేసుల ఆరోపణలు ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ... బోస్టన్ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటారా అని అనురాధ నిలదీశారు.

రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మండిపడ్డారు. రాజధాని విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని వైకాపా నేతలు కొత్త కథలు చెబుతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments