Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ: తెదేపా

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
రాజధానుల ప్రతిపాదనపై వైకాపా ప్రభుత్వం నియమించిన బోస్టన్ కమిటీ... ఓ బోగస్ కమిటీ అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఎఫ్​బీఐ కేసులున్న కంపెనీకి సీబీఐ కేసులున్న వైకాపా నేతలు రాజధాని బాధ్యతుల అప్పగించారని విమర్శించారు.

విజయసాయిరెడ్డి అల్లుడికి బోస్టన్ గ్రూప్ ఛైర్మన్ మిత్రుడు కావటం వలనే రాజధానుల బాధ్యత ఆ కంపెనీకి ఇచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. రాజధానుల గురించి వేసిన బోస్టన్ కమిటీపై ఎఫ్​బీఐ కేసులు ఉన్నాయని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఫ్‌బీఐ కేసులు ఉన్న కంపెనీకి సీబీఐ కేసులు ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి... బాధ్యత ఇచ్చారని విమర్శించారు. ఫొక్స్‌వ్యాగన్‌, సారా కేసుల ఆరోపణలు ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ... బోస్టన్ కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకుంటారా అని అనురాధ నిలదీశారు.

రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత కక్షని మండిపడ్డారు. రాజధాని విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని వైకాపా నేతలు కొత్త కథలు చెబుతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments