Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాపై బోండా 'గుండు' సవాల్ కలిసొచ్చిందా? కాకినాడలో కూడా...

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుం

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:34 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సమయంలో తెలుగుదేశం, వైకాపా పార్టీల నాయకులు పరస్పరం చేసుకున్న మాటల దాడి గురించి చెప్పక్కర్లేదు. వైకాపా ఎమ్మెల్యే రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, నంద్యాల ఎన్నికలో తెదేపా ఘోర పరాజయం పాలవుతుందని చేసిన వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెకు అప్పట్లో ఓ సవాల్ కూడా విసిరారు.
 
నంద్యాలలో తెదేపా ఓడితే తను గుండు చేయించుకునేందుకు సిద్ధంగా వున్నాననీ, అదే వైసీపి ఓడిపోతే రోజా కూడా గుండు చేయించుకునేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్ పైన రోజా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ బోండా ఉమ సవాల్ మాత్రం బాగా పబ్లిసిటీ అయ్యింది. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బహిరంగంగా ఉరి తీసినా తప్పులేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దెబ్బకొట్టాయని అంటున్నారు. 
 
మొత్తమ్మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళిలో చేసిన తప్పిదాల వల్ల చాలా వరకూ నెగటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అక్కడ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలపై మరోసారి బోండా ఉమ తన 'గుండు' సవాల్ మరోసారి విసురుతారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments