Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మె

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (12:09 IST)
భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
 
ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. మీ ఓటమికి కారణాలు ఏమిటని అడిగినప్పుడు... తెదేపా విపరీతంగా డబ్బులు పంచిందనీ, ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకూ పంచారు. అంతేకాదు... దేవాలయాలు, మసీదులు, స్మశానాలకు డబ్బు మంజూరు చేశారు. విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. 
 
ఇంకా నేను మలేరియా బారిన పడి 20 రోజుల పాటు బయటకు రాలేకపోయాను. ఇది కూడా నా ఓటమికి ఓ కారణం. అంతేకాదు... భూమా నాగిరెడ్డిపై వున్న సానుభూతి కూడా పనిచేసింది. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించినదేమీ ఇక్కడ పనిచేయలేదు" అని చెప్పుకొచ్చారు శిల్పా మోహన్ రెడ్డి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments