Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రైళ్లకు బాంబు బెదిరింపులు.. 2 గంటల పాటు ఆలస్యంగా రైళ్లు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (17:06 IST)
ఏపీలోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వచ్చే రైళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ రైళ్లలో  బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఫోన్‌ కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది.
 
ఈ మేరకు ఓ ఆగంతకుడు డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆగంతుకుడి ఫోన్‌ కాల్‌తో ఈ మార్గంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాజీపేటలో లోకమాన్య తిలక్ టెర్మినస్ ట్రైన్, చర్లపల్లి వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను ఆపి తనిఖీలు చేపట్టారు.
 
మొత్తం రైలు బోగీల్లోని అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను జాగిలాలతో తనిఖీ చేశారు. కానీ బాంబుకు సంబంధించి ఆనవాళ్లు లేకపోవడంతో రైళ్లను పంపేశారు. ఈ క్రమంలోనే బెదిరింపును పోలీసులు ఫేక్‌కాల్‌గా తేల్చారు. 
 
మరోవైపు బాంబు బెదిరింపు కాల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తనిఖీల కారణంగా రెండు రైళ్లూ సుమారు 2 గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments