Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునసాగర్​లో జల విహారానికి లాంచీలు సిద్ధం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (21:51 IST)
గలగల పారే కృష్ణమ్మ పరవళ్లు, ఎటు చూసినా ప్రకృతి రమణీయతను తలపించే సాగరంలో... లాంచీల ప్రయాణానికి ఏడాదిగా బ్రేకులు పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు నాగార్జున సాగర్​లో సైతం లాంచీల విహారాన్ని ప్రభుత్వం నిలిపి వేయగా... ఇప్పుడది తిరిగి ప్రారంభం కానుండటంతో ప్రకృతి ఒడిలో పర్యటకులు ఆనందంగా గడపనున్నారు.
 
పర్యటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చే సాగరంలో... లాంచీ ప్రయాణానికి ఏడాది కాలంగా బ్రేకులు పడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాష్టంలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా నాగార్జున సాగర్​లో సైతం లాంచీల విహారాన్ని ప్రభుత్వం నిలిపి వేసింది. దీనివల్ల ఇక్కడ బోటు చప్పుళ్లు వినిపించటంలేదు.
 
కష్టంగా మారిన చిరువ్యాపారుల జీవనంలాంచీ స్టేషన్ ప్రాంగణంతో పాటు లాంచీ ప్రయాణికులపై ఆధార పడి జీవించే చిరు వ్యాపారుల దుకాణాలు బోసిపోవడంతో... వారి జీవనం గడవడమే కష్టంగా మారింది. పర్యటకులు సైతం లాంచీ స్టేషన్ వరకు వచ్చి నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండటంతో సాగర్​లో లాంచీల జల విహారానికి మార్గం సుగమమైంది.

పలువురు అధికారులు వచ్చి లాంచీల ఫిట్ నెస్ పరిశీలించి వెళ్లారు. జల విహారానికి సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా... ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అది రాగానే జలాశయం నుంచి నాగార్జున కొండకు లాంచీ విహారాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లాంచీ స్టేషన్ అధికారులు చెబుతున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తిఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి లాంచీలను సిద్ధంగా ఉంచామని... మరో నాలుగైదు రోజుల్లో జల విహారం మొదలవుతుందని స్టేషన్ అధికారి భైరవ స్వామి తెలిపారు. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యటకుల ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం కలగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments