Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న ఒక్కసారి లేవమ్మా.. బోటు ప్రమాదంలో మృతి చెందిన హాసిని..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:50 IST)
నాన్న ఒక్కసారి లేవమ్మా.. నీకు ఇష్టమైన చీర తీసుకొచ్చాను.. ఒక్కసారి చూడమ్మా అంటూ బోటు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని తల్లి మధులత బోరున విలపిస్తున్న తీరు తిరుపతి స్థానికులను కలచి వేస్తోంది. మూడురోజుల క్రితం పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం కుటుంబం కనిపించకుండా పోయారు. సుబ్రమణ్యం భార్య మధులత మాత్రం సురక్షితంగా బయటపడింది. కానీ, భర్త సుబ్రమణ్యం, అతని కుమార్తె హాసిని మాత్రం కనిపించకుండా పోయారు. 
 
రెండురోజుల పాటు ఎన్టీఆర్‌ఎఫ్ బలగాలు రెస్క్యూ నిర్వహించి మృతదేహాలను బయటకు తీశారు. భర్త, కుమార్తె మృతదేహాలను చూసిన మధులత చలించిపోయింది. తీవ్ర ఆవేదనకు గురైంది. మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి హాసిని మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కారంపల్లిలోని రాదేశ్ శ్యామ్ అపార్టుమెంట్‌లో పార్థీవదేహాన్నిసందర్శనార్ధం ఉంచారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని చిత్తూరు సమీపంలోని పూతలపట్టు వద్దనున్న వేపనపల్లెకు తీసుకెళ్ళారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, ఈ నెల 16వ తేదీన హాసిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి వుండగా, బోటు ప్రమాదంలో జలసమాధి అయింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments