Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ తీరంలో బోటు ప్రమాదం... పేలిన సిలిండర్లు... బోటు దగ్ధం...

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (12:45 IST)
కాకినాడ తీరంలో బోటు ప్రమాదం సంభవించింది. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తీరానికి తిరిగి వస్తుండగా, బోటులోని సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. దీంతో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ఫలితంగా 80 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.
 
కాకినాడ తీర ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు వారం రోజుల క్రితం చేపలవేటకు వెళ్ళారు. తాజాగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మచిలీపట్టణానికి తిరుగుపయనమయ్యారు. 
 
ఈ జాలర్లు మరో నాలుగు గంటల్లో తీరానికి చేరుకుంటుందనగా శుక్రవారం తెల్లవారుజామున సిలిండర్ పేలి ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. 
 
దీంతో అప్రమత్తమైన జాలర్లు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న తీర రక్షణ దళం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. బోటులోని 12 మంది జాలర్లను రక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం