Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:57 IST)
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలో ఆదిశంకరాచార్యులు మహోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 
 
 
కేదారినాథ్ నుంచి మోడీ ప్రసంగాన్ని శ్రీనివాసమంగాపురంలో భారీ స్క్రీన్ ద్వారా భక్తులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం తర్వాత మీడియాతో సునీల్ మాట్లాడుతూ జగద్గురువుగా దేశంలోని అనేక మతాలను హిందూమతంలో ఏకం చేసిన ఘనత శంకరాచార్యులదని కొనియాడారు. దేశ ఐక్యతకు సమగ్రతకే జగద్గురు శంకరాచార్యులు ఆదర్శంగా నిలిచారన్నారు.

 
కేదార్ నాధ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆది శంక‌రాచార్యుల వారి స‌మాధి పున‌:  ప్రారంభోత్స‌వం చేశారు. దీనిని పుర‌స్క‌రించుకుని, ఆది శంక‌రాచార్యులు న‌డ‌యాడిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో ఆయ‌న సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ వేడుక‌లు శంక‌రాచార్యుల వారు సంద‌ర్శించిన అన్ని పుణ్య క్షేత్రాల‌లో జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వం పైన బీజేపీ జాతీయ కార్యదర్శి  సునీల్ దియోధర్తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎందులోనూ చిత్త‌శుద్ధి లేద‌ని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments