Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ వైఖరి వల్లే విభజన చట్టం నీరుగారుతోంది: లక్ష్మణ్

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (11:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విభజన చట్టం నీరుగారడానికి ప్రధాన కారణం సీఎం జగన్ వైఖరే కారణమని ధ్వజమెత్తారు. తిరుతిలో జరిగిన ప్రజాపోరు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మూడు రాజధానులంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ మండిపడ్డారు. తిరుపతిలో జరిగిన ప్రజాపోరు సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయని అన్నారు. ఫలితంగా అభివృద్ది మచ్చకైనా లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్నారు.

మూడు రాజధానుల అంశంతో ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పైగా, ఏపీ వల్లే పునర్విభజన చట్టం నీరుగారిపోతోందన్నారు. ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేరకు అప్పు చేసిందన్నారు. ఫలితంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకునిపోయిందన్నారు. ఏపీతో పాటు తెలంగాణాలోనూ కుటుంబ పాలన సాగుతున్నాయన్నారు.

కేసీఆర్ నాలుగేళ్లుగా జాతీయ పార్టీ, జాతీయ ఫ్రంట్ పేరుతో ఉవ్విళ్ళూరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments