Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జోన్‌పై రైల్వే బోర్డు ఛైర్మన్‌ త్రిపాఠితోనే ప్రకటన చేయిస్తా : జీవీఎల్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:16 IST)
ఏపీ విభజన హామీల్లో ఒకటైన విశాఖపట్టణంకు రైల్వే జోన్ అంశంపై రైల్వే బోర్డు ఛైర్మన్ త్రిపాఠీతోనే ఒక ప్రకటన చేయిస్తానని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. 
 
విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం చేతులెత్తేసిందంటూ వార్తా కథనాలు వచ్చాయి. వీటిపై జీవీఎల్ స్పందించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలను ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. రైల్వే జోన్ అంశంపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ త్రిపాఠీతో ప్రకటన చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు. 
 
విభజన హామీల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించాలన్నారు. కేవలం వ్యక్తిగత సమస్యల కోసమే కలుసుకుంటారా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఒకలా ఢిల్లీలో ఒకలా వైకాపా, తెరాస అధినేతలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు డ్రామాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments