Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిజినాలిటీ లేని రాజకీయ నేత చంద్రబాబు : సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (12:46 IST)
ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో ఒరిజినాలిటీ లేని నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నరు. గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 30కు మించి సీట్లు రావని తాను ఎపుడో చెప్పానన్నారు. ఎందుకంటే.. చంద్రబాబుపై నిజాయితీ లేదన్నారు. 
 
ఇకపోతే, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల గతంలో బీజేపీ, ఇపుడు జనసేన పార్టీలు తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. గత ఐదేళ్ళ కాలంలో ప్రజాగ్రహం తీవ్రంగా పెరిగిందన్నారు. సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌నే చొక్కా చినిగి పోయేలా కొట్టారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
అదేసమయంలో అత్యంత క్లిష్టసమయంలో జగన్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్నారు. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇప్పటివరకు 1996 ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో బీజేపీ ఇపుడిపుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments