Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరిజినాలిటీ లేని రాజకీయ నేత చంద్రబాబు : సోము వీర్రాజు

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (12:46 IST)
ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో ఒరిజినాలిటీ లేని నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నరు. గురువారం వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 30కు మించి సీట్లు రావని తాను ఎపుడో చెప్పానన్నారు. ఎందుకంటే.. చంద్రబాబుపై నిజాయితీ లేదన్నారు. 
 
ఇకపోతే, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల గతంలో బీజేపీ, ఇపుడు జనసేన పార్టీలు తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. గత ఐదేళ్ళ కాలంలో ప్రజాగ్రహం తీవ్రంగా పెరిగిందన్నారు. సాక్షాత్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌నే చొక్కా చినిగి పోయేలా కొట్టారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు. 
 
అదేసమయంలో అత్యంత క్లిష్టసమయంలో జగన్ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్నారు. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇప్పటివరకు 1996 ఎన్నికల్లోనే ఒంటరిగా పోటీ చేసి గెలుపొందారని ఆయన గుర్తుచేశారు. ఏపీలో బీజేపీ ఇపుడిపుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments