Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేతలు.. తీవ్ర ఉద్రిక్తత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:10 IST)
పోలీసుల ఓవరాక్షన్ కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థంలోని బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన విషయం తెలిసిందే.

ఆలయానికి సమీపంలో ఉన్న కోనేటిలో రాముల వారి శిరస్సు లభ్యమైంది. నాటి నుంచి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. నెల్లిమర్ల జంక్షన్‌ దగ్గర బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments