Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేతలు.. తీవ్ర ఉద్రిక్తత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:10 IST)
పోలీసుల ఓవరాక్షన్ కారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థంలోని బోడికొండపై ఉన్న పురాతన కోదండరాముడి విగ్రహ శిరస్సును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించిన విషయం తెలిసిందే.

ఆలయానికి సమీపంలో ఉన్న కోనేటిలో రాముల వారి శిరస్సు లభ్యమైంది. నాటి నుంచి నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. నెల్లిమర్ల జంక్షన్‌ దగ్గర బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రామతీర్థం కొండపైకి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

అయితే అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, కార్యకర్తలు ముందుకు వచ్చారు. తోపులాటలో సోమువీర్రాజు, విష్ణువర్థన్‌ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments