Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా : బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (15:22 IST)
ఏపీకి భారతీయ జనతా పార్టీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ళ తర్వాత మూసేసే పార్టీ వైకాపా అంటూ సంచలన కామెంట్స్ చేసారు. ఈయన ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'వైసీపీ మూసేసే పార్టీ. మూడు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ఉండదు. గ్యారెంటీగా చెబుతున్నా. కావాలంటే రాసిపెట్టుకోండి. మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం' అంటూ విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు. 
 
తెలుగు దేశం పార్టీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి తాను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ సెటైర్ వేశారు. ఇప్పటికే ప్రజలు జగన్ పాలనపై విసుగెత్తిపోయారని చెప్పారు. 
 
ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది కపట ప్రేమ అని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
విశాఖలో అక్రమ కట్టడాలంటూ శుక్రవారం రాత్రి నుంచే కూలగొడుతున్నారని చెప్పారు. కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని కోరారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని, లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments